News February 19, 2025

జీబీఎస్‌తో గుంటూరు మహిళ మృతి

image

గిలియన్ బారో సిండ్రోమ్ (GBS)తో గుంటూరు నెహ్రూనగర్‌కి చెందిన మహిళ మరణించారు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడుతూ గత కొద్దిరోజుల క్రితం నెహ్రూనగర్‌కి చెందిన గౌర్ జాన్ (65) జీజీహెచ్‌లో చేరారు. మొదటి మరణం సంభవించినప్పుడు జీబీఎస్ అంత ప్రమాదం ఏమీ కాదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి చెప్పారు. కానీ ఇప్పుడు నగరానికి చెందిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో గుంటూరు నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Similar News

News March 28, 2025

ఉండవల్లిలో యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

image

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించినట్లు సమాచారం.

News March 28, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన భధ్రతా సీళ్లు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.

News March 27, 2025

గుంటూరు జిల్లాలో గెలిచిన వారి వివరాలు

image

గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ముగిశాయి. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు (TDP) ఉప సర్పంచ్‌గా నాగమల్లేశ్వరరావు గెలుపొందారు. గుంటూరు రూరల్ మండల ఉపాధ్యకుడిగా కాకాని రమేష్(YCP), దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా షేక్ జబీన్(TDP), తెనాలి కోఆప్షన్ సభ్యుడిగా సయ్యద్ జానీ బాషా(YCP), కొల్లిపర మండలం (YCP) తూములూరు ఉప సర్పంచ్‌గా ఆరుమళ్ల శివారెడ్డి ఎన్నికయ్యారు.

error: Content is protected !!