News March 24, 2025

జీలుగుమిల్లి: వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేయించిన భార్య

image

జీలుగుమిల్లి (M) తాటియాకులగూడెంలో సంచలనం రేపిన గంధం బోస్‌ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్, శాంతకుమారిలు భార్యాభర్తలు. తన మేనమామ సొంగా గోపాలరావుతో శాంతకుమారి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బోస్‌ అడ్డు తొలగించుకోవాలని గోపాలరావు, శాంతకుమారి ప్లాన్ వేశారు. నిద్రలో ఉన్న బోస్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. 

Similar News

News November 15, 2025

GWL: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

image

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శనివారం ఐడీఓసీ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సజావుగా జరగాలన్నారు. రైతులకు ముందస్తుగా తేమశాతం పై ఏఈఓ లు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన పత్తి, ధాన్యం కేంద్రానికి వచ్చే విధంగా చూడాలన్నారు.

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

News November 15, 2025

కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్

image

జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సమస్యలను తీర్చాలని కలెక్టర్ సూచించారు.