News March 24, 2025
జీలుగుమిల్లి: వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేయించిన భార్య

జీలుగుమిల్లి (M) తాటియాకులగూడెంలో సంచలనం రేపిన గంధం బోస్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్, శాంతకుమారిలు భార్యాభర్తలు. తన మేనమామ సొంగా గోపాలరావుతో శాంతకుమారి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బోస్ అడ్డు తొలగించుకోవాలని గోపాలరావు, శాంతకుమారి ప్లాన్ వేశారు. నిద్రలో ఉన్న బోస్ను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు.
Similar News
News April 25, 2025
చెపాక్లో SRHకు కష్టమే?

ఈరోజు CSKvsSRH మ్యాచ్లో ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. చెన్నై కంటే రైజర్స్కే ఓటమికి అవకాశాలెక్కువ ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. చెపాక్లో SRH చెత్త రికార్డే దీనిక్కారణం. ఆ స్టేడియంలో సన్రైజర్స్ 12 మ్యాచులాడితే రెండింటిలోనే గెలిచింది. మొత్తంగా IPLలో చెన్నైపై 22 మ్యాచులు ఆడిన హైదరాబాద్ 6సార్లు మాత్రమే విన్ అయింది.
News April 25, 2025
సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP నేత మాధవరెడ్డిని గురువారం తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు CID DSP కొండయ్య నాయుడు తెలిపారు.
News April 25, 2025
WGL: బైకుపై వెళ్తుండగానే గుండెపోటు.. వ్యక్తి మృతి

గుండెపోటుతో వ్యక్తి మరణించిన ఘటన <<16198792>>WGL జిల్లాలో<<>> నిన్న జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం మేజరాజుపల్లికి చెందిన యాకయ్య(45) KNR జిల్లాలోని ఓ క్వారీలో పని చేస్తున్నాడు. బాబాయి బిడ్డ పెళ్లికోసం స్వగ్రామానికి వచ్చి తిరిగి KNR బయల్దేరాడు. పర్వతగిరి మండలానికి చెందిన ఓ వ్యక్తి లిఫ్ట్ అడగ్గా.. అతడినే బైక్ నడపమని వెనక కూర్చున్నాడు. గవిచర్లకు చేరుకోగానే గుండెపోటుతో మరణించాడు.