News March 21, 2025
జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.
Similar News
News April 24, 2025
విశాఖ: కొద్దిరోజుల్లో పెళ్లి.. యువతి ఆత్మహత్య

మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం KGHకు తరలించారు.
News April 24, 2025
కంచరపాలెం: బస్సు ఢీకొని మహిళ మృతి

కంచరపాలెం ఊర్వశి జంక్షన్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న ఎన్.మేరీ (62 ) అక్కడికక్కడే చనిపోగా, డ్రైవ్ చేస్తున్న కూతురు సుధారాణి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 24, 2025
పదో తరగతి ఉత్తీర్ణతలో 98.41%తో పద్మనాభం టాప్

విశాఖ జిల్లాలో మండలాల వారీగా 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. పద్మనాభం 98.41%తో మొదటి స్థానంలో, విశాఖ అర్బన్ 83.17%తో చివరి స్థానంలో నిలిచాయి. ఆనందపురం 89.78, భీమునిపట్నం 91.74, చినగదిలి 85.27, గాజువాక 90.22, గోపాలపట్నం 89.78, ములగాడ 92.29, పెదగంట్యాడ 83.75, పెందుర్తి 91.14, సీతమ్మధార 91.57% ఉత్తీర్ణత సాధించాయి.