News December 22, 2024

జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలకు నోటిఫికేషన్

image

జీవీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్‌లో నియమించుటకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.8 మంది న్యాయవాదులు నియామకం నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు.బార్ కౌన్సిల్స్ లో కనీసం 10 సంవత్సరాల మెంబర్‌గా రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.ఆసక్తి గలవారు జనవరి 6 లోపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.

Similar News

News February 5, 2025

KGHలో రౌడీషీటర్ హల్‌చల్

image

విశాఖ కేజీహెచ్‌లో రౌడీషీటర్ బుధవారం హల్‌చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్‌లైన్‌ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్‌ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.

News February 5, 2025

గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు. 

News February 5, 2025

పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు

image

రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.

error: Content is protected !!