News June 12, 2024
జీహెచ్ఎంసీ పరిధిలో మరో 15 DRF బృందాలు: సీఎస్
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 30 DRF బృందాలకు తోడు మరో 15 బృందాలను ఏర్పాటు చేయనున్నట్లుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. వీరి సేవలను ORR వరకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థంగా ఎదుర్కొని పౌరులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకే DRF బృందాలను విస్తరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 4, 2024
BREAKING: HYD: విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి
మేడ్చల్ జిల్లాలో కాసేపటి క్రితం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. శామీర్పేట్ పరిధి మూడుచింతలపల్లి మండలం కొల్తూరు చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. దసరా సెలవుల నేపథ్యంలో హర్ష, మణికంఠ, మనోజ్ ఇంటి దగ్గర నుంచి ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడదామని దిగి ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. > సెలవు రోజుల్లో పిల్లలు జర జాగ్రత్త..!
News October 4, 2024
HYD: మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో అడ్మిషన్స్
మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. MA-Urdu,MA -Hindi,MA-English, BA,B com, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నా యని చెప్పారు. వెబ్సైట్ http//manuadmission mion.samarth.edu.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10 నవంబర్ 2024 వరకు అవకాశం ఉందని చెప్పారు.
News October 4, 2024
HYD: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లా పర్యటన
PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం నుంచి జిల్లా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచే పర్యటన ప్రారంభించనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటి నుంచి నిజామాబాద్ బయలుదేరుతారు. ఆయన వెంట ఎనిమిది మంది మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ సీనియర్ నేతలు ఉంటారని తెలిపారు.