News January 24, 2025
జుక్కల్: చికెన్ కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన నాగనాథ్ అనే వ్యక్తి ఈనెల 23న సాయంత్రం పెద్ద ఏడ్గి గ్రామానికి బైక్పై చికెన్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
గజ్వేల్: అందని వైద్య సేవలు..!

వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన ఎల్డర్లీ హెల్త్ కేర్ కార్యక్రమం నామమాత్రంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. వృద్ధులకు ఆయా రకాలైన వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందించారు. కానీ ప్రస్తుతం ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)లో విలీనం చేయడంతో వృద్ధులకు సేవలు నిలిచిపోయాయి.
News November 22, 2025
NLG: రిజర్వేషన్ కలిసివచ్చేనా!?

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రామం, వార్డు రిజర్వేషన్లు ఏది అవుతుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కలెక్టరేట్లో ఆర్డీవో, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం పాత కేటగిరిల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో రిజర్వేషన్ కలిసి వస్తుందా? లేదా అనే ఆందోళన కనిపిస్తుంది.
News November 22, 2025
పాలమూరు: యాక్సిడెంట్లో మహిళ మృతి.. గుర్తిస్తే చెప్పండి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఎర్రవల్లి మండలంలో జరగింది. కొండేరు శివారులోని పెట్రోల్ బంకు దగ్గర హైవే దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ దుర్మరణం పాలైంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు మండల ఎస్సై రవి తెలిపారు. మృతురాలి చేతిపై లింగస్వామి అనే పచ్చబొట్టు ఉందన్నారు. ఎవరైనా గుర్తిస్తే 9346987198 నంబర్కు కాల్ చేయాలన్నారు.


