News March 5, 2025
జుక్కల్: చెరువులో పడి వ్యక్తి మృతి

జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో గంగారాం అనే వ్యక్తి బుధవారం ఉదయం గ్రామంలోని చెరువులోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి మృతి చెందినట్లు ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పంచనామ నిర్వహించి బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News November 10, 2025
వెల్దుర్తి: పెద్దపులి దాడిలో రెండు గేదెలు మృతి.?

వెల్దుర్తి మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని వజ్రాలపాడు తండా సమీపంలో పెద్దపులి దాడి ఘటన కలకలం రేపింది. మూఢావత్ తులస్యానాయక్ గేదె శనివారం, మరో గేదె ఆదివారం మృత్యువాత పడ్డాయి. రేంజర్ సుజాత మాట్లాడుతూ.. పశువులను అడవిలోకి పంపవద్దని, రాత్రి వేళ పెట్రోలింగ్ కొనసాగుతోందని చెప్పారు. ట్రాప్ కెమెరాలు, పాదముద్రల ద్వారా పులి కదలికలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
News November 10, 2025
గిరాకీ లేని టెస్లా.. అక్టోబర్లో అమ్మింది 40 కార్లే

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన ‘టెస్లా’ కార్లకు ఇండియాలో పెద్దగా గిరాకీ కనిపించడం లేదు. దేశంలో జులైలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటిదాకా 104 కార్లే విక్రయించింది. అక్టోబర్లో 40 కార్లు మాత్రమే అమ్మగలిగింది. ఒకే మోడల్, రెండే స్టోర్లు, దిగుమతి చేస్తుండటం, అధిక ధరలే కారణమని తెలుస్తోంది. మరో విదేశీ కంపెనీ విన్ఫాస్ట్ ఇక్కడే తయారు చేసి, తక్కువ ధరలకే ఎక్కువ కార్లను విక్రయిస్తోంది.
News November 10, 2025
సిద్దిపేట: ప్రజాకవి అందెశ్రీ అందుకున్న పురస్కారాలు

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన <<18246561>>అందెశ్రీ<<>> KU నుంచి డాక్టరేట్ పొందారు. అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు నంది పురస్కారం. 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు.


