News February 16, 2025
జుక్కల్: బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

జుక్కల్ మండల కేంద్రానికి చెందిన బిజ్జవార్ చంద్రమోహన్ ఇవాళ ఉదయం పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. మృత దేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి పంపించినట్లు వివరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
అనకాపల్లి: 91.62 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 3.13 గంటల వరకు 91.62 శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసినట్లు డీ.ఆర్.డీ.ఏ పీడీ శచీదేవి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,56,338 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,34,866 మందికి అందజేసినట్లు తెలిపారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా 95.63 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. సాయంత్రంలోగా అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
News December 1, 2025
అనకాపల్లి: ఇళ్లు, ఇంటి స్థలం కోసం వేచి చూస్తున్న వారికి గమనిక

PMAY హౌసింగ్(గ్రామీణ) సర్వే గడువును ఈ నెల 14 వరకు పొడిగించారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు సోమవారం వడ్డాదిలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో స్థలం ఉన్నవారికి ఇళ్ల స్కీం, స్థలం లేని వారికి స్థలంతో ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు. గత నెల 30తో గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం గడువు పొడిగించిందన్నారు. అర్హులు సచివాలయాలలో దరఖాస్తు సమర్పించాలన్నారు.
News December 1, 2025
NLG: లంచం అడుగుతున్నారా..!

ఈనెల 3 నుంచి ఏసిబి తెలంగాణ వారోత్సవాలు-2025 నిర్వహిస్తున్నట్లు నల్గొండ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు 9వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. అవినీతి నిర్మూలనలో మీ సహకారం అమూల్యమన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్: వాట్సప్ నెంబర్: 94404 46106, ఫేస్ బుక్: ACBTelangana, X(పాత ట్విట్టర్): @TelanganaACB ద్వారా కంప్లయింట్ చేయవచ్చని తెలిపారు.


