News February 28, 2025
జూపార్కు ధరలు పెంపు.. రేపటి నుంచి అమల్లోకి

HYD నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ టికెట్లతో పాటు అన్ని రకాల టికెట్లపై ధరలను రాష్ట్ర అటవీ శాఖ ఆదేశాల మేరకు జూపార్క్ అధికారులు పెంచారు. రేపటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత తెలిపారు. 2 ఏళ్ల తర్వాత జూ పార్క్ టికెట్ల ధరలను పెంచారు. జూపార్క్ ప్రవేశ టికెట్ రూ.100, చిన్న పిల్లలకు రూ.50లతో పాటు జూలోని మరిన్నింటికి ధరలు పెంచారు.
Similar News
News May 7, 2025
HYD: ‘కారు’లన్నీ అటువైపే!

BRS రజతోత్సవ సభ కోసం నగర శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తరలించేందుకు నాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ను LED లైట్లతో అందంగా అలంకరించారు. సభ వరంగల్లో అయినా హైదరాబాద్ కేంద్రంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. బస్సులు, డీసీఎంలు, కార్లు ఘట్కేసర్ మీదుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
News May 7, 2025
హయత్నగర్: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్

హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News May 7, 2025
HYDలో 3 ప్రాంతాల్లో వ్యభిచారం.. అరెస్ట్

HYDలో వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్కాలనీలోని ఓ స్పా సెంటర్లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.