News May 18, 2024
జూబ్లీహిల్స్: నర్నే రోడ్డులో ఫ్యామిలీ విగ్రహాలు మాయం

హైదరాబాద్లో ఏకంగా ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు మాయం చేశారు. జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో జీహెచ్ఎంసీ వాళ్లు 2021లో ఒక ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు. అయితే దొంగలు ఆ ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కూతురు, కొడుకు విగ్రహాలు దొంగిలించారు. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా దొంగలు వదలడం లేదు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Similar News
News September 17, 2025
తెలంగాణ చరిత్రను BJP వ్యతిరేకిస్తోంది: కవిత

తెలంగాణ జాగృతి కార్యాలయంలో SEP 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని కవిత అన్నారు. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని కవిత అన్నారు. మోదీపై ప్రేమ లేకపోతే ఆ పార్టీ దుష్ప్రచారం ఆపాలని.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాయాలన్నారు.
News September 17, 2025
HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.
News September 17, 2025
1948 SEP 17 తర్వాత HYDలో ఏం జరిగింది?

‘ఆపరేషన్ పోలో’ తర్వాత HYD సంస్థానాదీశుడు నిజాం భారత ప్రభుత్వానికి తలొగ్గారు. ‘గోల్కొండ ఖిల్లా కింద ఘోరి గడతాం’అని ఎవరిపై ప్రజలు తిరగబడ్డారో ఆయనను ప్రభుత్వం తెలంగాణకు రాజ్ ప్రముఖ్గా నియమించి గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సెక్యూరిటీ కల్పించింది. రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసీం రజ్వీని పాకిస్థాన్కు పంపింది. 1952లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. ప్రజలను పీడించిన ప్రభువుల కథ సుఖాంతం అయింది.