News April 14, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
Similar News
News September 16, 2025
విశాఖ పోర్ట్ ఛైర్మన్ అంగముత్తుకు బదిలీ

విశాఖ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ అంగముత్తు బదిలీ అయ్యారు. ఆయనను ముంబై పోర్ట్ ఛైర్మన్గా బదిలీ చేస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మేలో ఆయన విశాఖ పోర్ట్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం.
News September 16, 2025
కిచెన్ గార్డెనింగ్ ఇలా చేసేద్దాం..

కిచెన్ గార్డెనింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. కిచెన్ ప్లాంట్స్కి 3-6 గంటల సూర్యరశ్మి అవసరం. వీటిని బాటిల్స్, గ్లాస్ కంటైనర్స్లో పెంచొచ్చు. సారవంతమైన మట్టి, మంచి విత్తనాలు వాడాలి. అప్పుడే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు, టమాటా, మిర్చి, అల్లం, బంగాళదుంప ఈజీగా పెరుగుతాయి. వీటికి సరిపడా నీరు పోయాలి. కుండీల కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ రసాయనాలు, పురుగుమందులు వాడకూడదు.
News September 16, 2025
మెదక్: ‘బాల్యం అనేది చదువుకోవడానికే’

బాల్యం అనేది చదువుకోవడానికి, కలలు కనడానికి, భవిష్యత్ నిర్మించుకోవడానికి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.శుభవల్లి అన్నారు. హవేలీ ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అమూల్యమైన దశ, వయస్సులోనే వివాహం జరగడం వలన బాలల ఆరోగ్యం, విద్య అన్ని దెబ్బతింటాయన్నారు. చిన్న వయస్సులో వివాహం జరపొద్దని సూచించారు.