News April 14, 2025

జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

image

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Similar News

News October 19, 2025

రేపు అన్నమయ్య జిల్లా ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు

image

అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్చిన ‘ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక’ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయ పోలీసులు ‘ప్రజా ఫిర్యాదుల వేదిక’ రద్దు చేసినట్లు చెప్పారు. దీపావళి పండుగ దృష్ట్యా సోమవారం జరగాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేశామని అన్నారు.

News October 19, 2025

మ్యాచ్ రీస్టార్ట్.. 26 ఓవర్లకు కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌‌కు వర్షం అంతరాయం కారణంగా అంపైర్లు ఓవర్లను 26కు కుదించారు. వర్షం కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ రీస్టార్ట్ అయింది. 18 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. అక్షర్(25*), రాహుల్ (5*) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో కనీసం 130 రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్‌ పోరాడేందుకు అవకాశం ఉండనుంది.

News October 19, 2025

దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

image

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.