News May 10, 2024
జూబ్లీహిల్స్: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పోక్సో కేసు నమోదైంది.
Similar News
News February 10, 2025
నేడు కొడంగల్కు KTR.. షెడ్యూల్ ఇదే!

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు కొడంగల్లో పర్యటిస్తారు.
షెడ్యూల్ వివరాలు:
10:30AM-నార్సింగిలోని నివాసం నుంచి బయలుదేరుతారు
12:30PM-పరిగి మాజీ MLA కొప్పుల మహేశ్ ఇంట్లో లంచ్
01:40PM-కొడంగల్ తున్కిమెట్లలో BRS పార్టీ జెండా ఆవిష్కరణ
02:00PM-హకీంపేట్, లగచర్ల, కోడైపల్లి, రోటిబండ తండా రైతులకు పరామర్శ
03:00PM-కోస్గి చౌరస్తాలో రైతు మహా ధర్నాలో పాల్గొంటారు.
News February 9, 2025
సికింద్రాబాద్: షాపింగ్ మాల్లో సూసైడ్ అటెంప్ట్!

సికింద్రాబాద్లో ఆదివారం దారుణం జరిగింది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఓ షాపింగ్ మాల్లో భార్య మౌనిక పని చేస్తుండగా ఆమెతో గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. దుకాణంలో కస్టమర్లు ఉండగానే ఘటన జరగడంతో అందరూ పరుగులు తీశారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News February 9, 2025
ఉప్పల్ MLA ఇంట్లో విషాదం

ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బండారి వెంకట్ రెడ్డి సతీమణి పద్మ సాయంత్రం కన్నుమూశారు. రేపు కీసర మండలం చీర్యాల వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర సైనిక్పురి నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15న MLA లక్ష్మారెడ్డి కూతురు వివాహం ఉండడం, ఇంతలోనే ఆయన వదిన మృతి చెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.