News July 18, 2024
జూరాల ప్రాజెక్టుకు వరద నీరు

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 1500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.140 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తి నీటి నిల్వ ప్రస్తుతం 6.987 టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు.
Similar News
News October 21, 2025
పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.
News October 21, 2025
నవాబుపేట: క్షతగాత్రుడి వివరాలు తెలిస్తే చెప్పండి

నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయ సమీపంలో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయాల పాలైన ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే.. 8712659340 సమాచారం ఇవ్వాలని ఎస్సై విక్రం మంగళవారం తెలిపారు.
News October 21, 2025
కురుమూర్తి రాయుడికి పట్టు వస్త్రాల తయారీ

కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సమర్పించేందుకు పట్టు వస్త్రాలు సిద్ధమవుతున్నాయి. ఉత్సవాల్లో రెండో ఘట్టమైన అలంకరణ ఉత్సవం రోజున ఈ వస్త్రాలు స్వామివారికి సమర్పించనున్నారు. ఆనవాయితీగా అమరచింత చేనేత కళాకారులు పట్టు వస్త్రాలను సమర్పించడం 66 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో గ్రామానికి చెందిన కొంగరి చెన్నయ్య అనే వ్యక్తి స్వామికి పట్టు వస్త్రాల మొక్కుబడి ఇప్పటికి ఉంటడం విశేషం.