News January 26, 2025
జెండాను ఎగరవేసిన పార్వతీపురం ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో వీరుల త్యాగఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని అన్నారు.
Similar News
News December 3, 2025
హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్ <<>>పాలసీపై KTR ప్రెస్మీట్ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.
News December 3, 2025
అన్నమయ్య జిల్లా రైతులకు గమనిక

అన్నమయ్య జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లు JC ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. రైతుల సౌకర్యార్థం రాయచోటి, నిమ్మనపల్లె, రామాపురం,వీరబల్లి, గాలివీడు తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ వరి క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ వరి క్వింటాకు రూ.2,389 చెల్లిస్తామన్నారు.
News December 3, 2025
ప్రమోషన్లు, సీనియారిటీ సమస్యల పరిష్కారానికి CMD హామీ

వరంగల్లో TGNPDCL ట్రేడ్ యూనియన్ల JAC ప్రతినిధులు CMD కర్నాటి వరుణ్ రెడ్డి ని కలిసి O&M, Provincial కేడర్లలో నిలిచిన ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అనంతరం ప్రమోషన్లు ఇస్తామని, అలాగే Paid Holiday, JAO సీనియారిటీ, ఆర్టిజన్లు,అన్మెన్,పీస్ రేటు కార్మికుల సమస్యలు మరియు కొత్త పోస్టుల భర్తీపై త్వరలో చర్యలు తీసుకుంటామని CMD హామీ ఇచ్చారు.


