News January 26, 2025
జెండాను ఎగరవేసిన పార్వతీపురం ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో వీరుల త్యాగఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని అన్నారు.
Similar News
News December 20, 2025
జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దాలి: కలెక్టర్

ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తితో యువత అందుబాటులోని పారిశ్రామిక పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంచాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటైన ఇగ్నైట్ సెల్ను ఆయన సందర్శించారు. జిల్లాను పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
News December 20, 2025
క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష

క్రిస్మస్ పండుగను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా, వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మూడు నియోజకవర్గాలకు (వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట) ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక్షలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.
News December 20, 2025
కొత్త భవనాలకు ‘గ్రీన్ బిల్డింగ్ కోడ్’: విజయానంద్

AP: ఇంధన పరిరక్షణ, నెట్ కార్బన్ జీరో లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని CS విజయానంద్ పేర్కొన్నారు. ‘కొత్త భవనాలకు ప్లాన్ శాంక్షన్ కావాలంటే తప్పనిసరిగా ఎనర్జీ ఎఫీషియెంట్ ఎక్విప్మెంట్ వాడాలనే నిబంధన (Green Building Code)ను తీసుకువచ్చాం. ప్రతి గ్రామంలో సోలార్ రూఫ్ ఏర్పాటును ప్రోత్సహించేలా గ్రీన్ ఎనర్జీ పాలసీ పెట్టాం. ఇంధన పొదుపుపై అవగాహనకు స్కూళ్లలో ఎనర్జీ లిటరసీ క్లబ్స్ నెలకొల్పాం’ అని వివరించారు.


