News January 26, 2025
జెండాను ఎగరవేసిన పార్వతీపురం ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో వీరుల త్యాగఫలితంతో మనకు స్వాతంత్రం వచ్చిందని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని అన్నారు.
Similar News
News December 9, 2025
వరంగల్లో ఉద్యోగులకు ఏసీబీ వణుకు

ఉమ్మడి వరంగల్లో ACB దాడులు పెరిగాయి. గతేడాది 16 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ తిమింగళం, తొర్రూర్ CI, పెద్ద వంగర తహశీల్దార్, తాజాగా HNK అడిషనల్ కలెక్టర్ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. DSP సాంబయ్య నేతృత్వంలో విద్యాశాఖలో 3, పోలీసు2, రవాణా2, రిజిస్ట్రేషన్2, రెవెన్యూ3, రోడ్లు1, వ్యవసాయం1, ట్రాన్స్ కో1, భగీరత1, పంచాయతీ రాజ్2, మత్స్యశాఖలో ఒకరు ACBకి చిక్కారు.
News December 9, 2025
USలో లోకేశ్ పర్యటన.. కీలక భేటీలు

AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్తో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. అలాగే ఓమిమం సంస్థ చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతోనూ ఆయన సమావేశమయ్యారు. ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
News December 9, 2025
భారత్ బియ్యంపైనా టారిఫ్లకు సిద్ధమైన ట్రంప్

ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికన్ రైతులకు నష్టం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే భారత వస్తువులపై US 50% <<18423577>>సుంకాల<<>>ను విధించింది.


