News February 14, 2025

జేఈఈలో నేహలతకు 93.22 పర్సంటైల్

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.

Similar News

News September 14, 2025

ములుగు : సీఎం రేవంత్‌కు మేడారం సెంటిమెంట్

image

మేడారం అంటే సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. ఆయన రాష్ట్రంలో చేసిన హాత్ సే హాత్ జోడో యాత్రను మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధానం నుంచి Feb 6, 2023లో ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్ర దోహదపడింది. ప్రభుత్వం ఏర్పడ్డ తొలిసారి 2024లో జరిగిన జాతరకు రూ.105కోట్లు ఇచ్చిన సీఎం ఈసారి రూ 236.2కోట్లతో మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్ల పరిశీలనకు స్వయంగా రానున్నారు.

News September 14, 2025

HYD: ట్రాఫిక్ సమస్యలు.. మెట్రో ఎక్కిన బీజేపీ చీఫ్

image

దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ HYDలో రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో తాను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు.

News September 14, 2025

JGTL: ‘శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు’

image

శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్‌ బండి తరాల శ్రీకాంత్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో శ్రీకాంత్‌పై పీడి యాక్ట్ అమలు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ కరుణాకర్ శనివారం నిందితుడికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులను అందజేశారు.