News February 14, 2025
జేఈఈలో నేహలతకు 93.22 పర్సంటైల్

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.
Similar News
News February 27, 2026
కర్నూలు కూటమి నేతలకు మంత్రి లోకేశ్ విందు

ఉండవల్లిలోని తన నివాసంలో కర్నూలు పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్ గురువారం విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, జయ నాగేశ్వర్ రెడ్డి, పార్థసారథి తదితర నేతలు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన దరఖాస్తుల పరిష్కార స్థితిని మంత్రి వివరించారు. అనంతరం మహిళలకు మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు.
News February 27, 2026
అనంతపురం జిల్లాలో ప్రమాదం.. ఇద్దరి మృతి

అనంతపురం జిల్లా గుత్తి మండలం టి.కొత్తపల్లి సమీపంలోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈసురాళ్లపల్లికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 27, 2026
గోల్డ్, సిల్వర్ ETFలు ఇక దేశీయ ధరల్లోనే

ఏప్రిల్ 1 నుంచి గోల్డ్, సిల్వర్ ETFల వాల్యుయేషన్ పద్ధతి మారుతోంది. ఇకపై అంతర్జాతీయ LBMA ధరలకు బదులు మన దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించే ‘స్పాట్ ధరల’ ఆధారంగా వీటి విలువను లెక్కిస్తారు. దీంతో ధరల్లో పారదర్శకత పెరిగి, మన మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా రేట్లు ఉంటాయి. అలాగే విపరీతమైన హెచ్చుతగ్గులను అరికట్టడానికి సెబీ 15 నిమిషాల ‘కూలింగ్-ఆఫ్’ పీరియడ్ను కూడా ప్రవేశపెట్టింది.


