News February 11, 2025

జేఈఈ మెయిన్-2025 ఆలిండియా టాపర్‌గా భాష్యం విద్యార్థిని

image

జేఈఈ మెయిన్-2025 జనవరి ఫలితాలలో భాష్యం అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. సెషన్-1 ఫలితాలలో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థిగా నిలిచింది. మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. భాష్యం ప్రత్యేక కరికులంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలుయజేస్తూ.. విద్యార్థులను, అధ్యాపకులను సంస్థ యాజమాన్యం అభినందించింది.

Similar News

News March 28, 2025

GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

image

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడి‌పై పట్టాభిపురం పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.

News March 28, 2025

ఉండవల్లిలో యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

image

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించినట్లు సమాచారం.

News March 28, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన భధ్రతా సీళ్లు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!