News October 30, 2024

జేఎన్టీయూ, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీలొచ్చేదెప్పుడు?

image

విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 యూనివర్సిటీలుండగా 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌లను ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఇంకా 3 యూనివర్సిటీలకు వీసీలను నియమించకుండా పెండింగ్‌లోనే పెట్టింది. ఈ మూడింటిలో JNTU, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీలున్నాయి. వీసీల ఎంపికలో ఒకే సామాజిక వర్గానికి చెందినవే వచ్చినట్లు తెలిసింది. వీసీలు లేక పరిపాలన కుంటుపడిందని పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.

News October 22, 2025

మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

image

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్‌లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్‌లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.

News October 22, 2025

చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.