News August 21, 2024
జేపీసీ కమిటీ తొలి సమావేశానికి బయలుదేరిన ఎంపీ

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంపీ డీకే అరుణ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి (JPC) తొలి భేటీలో పాల్గొనేందుకు ఆమె బుధవారం ఢిల్లీకి బయలుదేరారని ఆమె అనుచరులు తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలు, లోపాలు, రాష్ట్రాల వారీగా వక్ఫ్ భూముల వివరాల పర్యావసానాలు చర్చించనున్నారని, రేపు 11 గంటలకు పార్లమెంట్ హౌస్ లో తొలి భేటీలో పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
ఈ నెల 16న PU 4వ స్నాతకోత్సవ వేడుకలు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ రానున్నారన్నారు. ఈ వేడుకల్లో 12 పీహెచ్డీలు, బంగారు పతకాలు ప్రదానం ఉంటుందన్నారు.
News October 13, 2025
MBNR: జాగ్రత్త.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మంగళవారం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగు పారాయి. ఆయా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News October 13, 2025
MBNR ఇంటర్ విద్యార్థి సూసైడ్

మహబూబ్ నగర్ మండలంలోని రామ్ రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రియాంక (16) బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లా మల్దకల్. తనకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పగా.. సోమవారం వస్తామని చెప్పగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.