News August 10, 2024

జేసీ దివాకర్ రెడ్డితో పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ

image

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం హైదరాబాదులోని జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పల్లె పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ ముచ్చటించినట్లు సమాచారం. కాగా వయసు మీద పడటంతో జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే.

Similar News

News November 2, 2025

రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

image

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.

News November 1, 2025

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ కురుగుంట-2, యాడికి-1, రాయదుర్గం-1, కొర్రపాడు-1 UPHCలో జరిగిన మాతృమరణాలపై కలెక్టర్ ఆరా తీశారు.

News November 1, 2025

ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

image

అనంతపురంలోని 26వ డివిజన్‌ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.