News February 8, 2025

జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం

image

మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 

Similar News

News November 25, 2025

MHBD: రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిర మహిళ చీరల పంపిణీ MHBD పట్టణంలో నిర్వహించారు. అనంతరం వడ్డీ లేని రుణాలు రూ.2.70 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహలు కలకలం

image

కృష్ణానది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం ఇద్దరి మృతదేహలు కలకలం సృష్టించాయి. సుమరు 40 సంవత్సరాల వ్యక్తి, 12 సంవత్సరాల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. బ్యారేజ్ ర్యాంప్ సమీపంలో మృతదేహాలను గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.