News July 28, 2024
జైపాల్ రెడ్డి రాజకీయ నేత కాదు.. సిద్ధాంతకర్త: సీఎం

జైపాల్ రెడ్డి రాజకీయ నేత కాదు.. సిద్ధాంతకర్త అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అధికారం ఉన్నా లేకున్నా జైపాల్ రెడ్డి సిద్ధాంతం వీడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పాటుపడ్డారు. ఉత్తమ పార్లమేంటేరియన్గా ఎదిగారు. దేశ రాజకీయాలను శాసించే సత్తా కల్వకుర్తికి ఉంది. నేను ఎంత ఎదిగిన నల్లమల్ల బిడ్డనే.. నాకు ఏ పదవి వచ్చినా నా ప్రాంతాన్ని మర్చిపోను’ అని తెలిపారు.
Similar News
News November 16, 2025
MBNR:U-14,19..17న వాలీబాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 19 విభాగాల్లో బాల, బాలికలకు బాస్కెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 17న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ పత్రాలతో ఉ.9:00 గంటలలోపు పీడీ శైలజకు రిపోర్ట్ చేయాలన్నారు.SHARE IT.
News November 15, 2025
MBNR: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి- కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకితో పాటు పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే నేషనల్ హైవే 44, 167 పై బ్లాక్స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలన్నారు.
News November 15, 2025
MBNR: ధాన్యం కేటాయింపునకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి

2025-26 ధాన్యం కేటాయింపుకు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 92 రైస్ మిల్లులు ఉండగా నామమాత్రంగా కేవలం 42 రైస్ మిల్లులు మాత్రమే బ్యాంకు గ్యారెంటీని సమర్పించాయని అన్నారు. గ్యారంటీ ఇవ్వని మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపు జరగదన్నారు.


