News June 12, 2024
జైపూర్ అడవిలో 19 జింకలను వదిలిన అధికారులు

జైపూర్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో బుధవారం 19 చుక్కల జింకలను అధికారులు వదిలిపెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంత సమీపంలోని పొలాల్లో జింకలు సంచరించడంతో రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని వాటిని పట్టుకొని జైపూర్ అడవిలో వదిలిపెట్టారు.
Similar News
News October 28, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి: ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(CMR) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.
News October 28, 2025
ADB: అక్రమార్కులకు రాజకీయ అండదండలు..!

జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. నేతల అండతోనే రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించి, రౌడీషీటర్ల అక్రమ భాగోతాలను వెలికితీస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో, పోలీసులు కొరడా ఝళిపించి ఇటీవల భూదందాలు, పలు వివాదాల్లోని రౌడీషీటర్లు, నాయకులను జైలుకు పంపారు.
News October 28, 2025
ఆదిలాబాద్లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.


