News April 6, 2025

జైపూర్: ఇందారం ఓసీలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె

image

శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్ కాస్ట్ గనిలో వేతనాలు పెంచాలని ఓబీ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేపట్టారు. ఆదివారం సమ్మె శిబిరాన్ని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రొజ్ ఖాన్, బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ సందర్శించి మద్దతు తెలిపారు. వెంటనే కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 26, 2025

NGKL: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం

image

NGKLలో ప్రభుత్వ (డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్) కళాశాలలో నేడు పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 76వ వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి హాజరయ్యారు.అనంతరం పొలిటికల్ సైన్స్ విభాగం అధ్యాపకుడు నరేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, హక్కులు, అవకాశాలు, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడానికి కారణం రాజ్యాంగం అని అన్నారు.

News November 26, 2025

అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దాం: SP

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్లలోని పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు.

News November 26, 2025

ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

image

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.