News February 23, 2025

జైపూర్: వేలాల జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

image

మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 28 వరకు జైపూర్ మండలంలో జరిగే వేలాల జాతర ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వేలాల గుట్టపై, గ్రామంలో ఉన్న ఆలయం, తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఏలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రోడ్డు మరమ్మతులు చేయించాలని సూచించారు.

Similar News

News October 24, 2025

నరసరావుపేట: సీసీఆర్ నిధులపై వీడియో కాన్ఫరెన్స్

image

కలెక్టర్ కృతికా శుక్లా సామాజిక ఆరోగ్య కేంద్రం, మాచర్లకు సి.ఎస్.ఆర్. నిధుల ద్వారా కొనుగోలు చేయాల్సిన ఆసుపత్రి పరికరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పవర్ గ్రిడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అవసరమైన పరికరాలను జిల్లా పర్చేస్ కమిటీ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.

News October 24, 2025

రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ మాధవరెడ్డి

image

భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్‌లో పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రహదారి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కంప్యూటర్ సిబ్బంది కేసు ప్రాపర్టీ గదులను తనిఖీ చేసి భద్రతపై పలు సూచనలు అందించారు. కేసులు వివరాలు, దర్యాప్తు పెండింగ్ కేసులు పూర్తి చేయాలని సూచించారు.

News October 24, 2025

ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన కలెక్టర్

image

విదేశీ విద్యా విధానం ఆధ్యయానికి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులను విదేశీ విద్యా విధానాలు పరిశీలించేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేపడుతున్నామన్నారు.