News January 27, 2025

జైపూర్: సింగరేణి సంస్థ విస్తరణకు అడుగులు: సీఎండీ

image

సింగరేణి సంస్థను బహుముఖ విస్తరణకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి కార్పొరేట్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో  ఆయన మాట్లాడారు. జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించడంలో ప్రతీ ఉద్యోగి కీలక పాత్ర పోషించాలని కోరారు.

Similar News

News November 19, 2025

విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

image

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.

News November 19, 2025

రైతులకు గుడ్‌న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

image

AP: ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. 46,85,838 మంది ఖాతాల్లో రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.

News November 19, 2025

2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

image

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.