News January 2, 2025
జైలుకు వెళ్లి వచ్చిన వారు క్రైం రేటు పెరిగిందంటున్నారు: షబ్బీర్ ఆలీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1735739726725_50139228-normal-WIFI.webp)
జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, క్రైం రేటు పెరిగిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నేరాలు అధికంగా జరిగాయని ఆరోపించారు. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచారని విమర్శించారు.
Similar News
News January 24, 2025
NZB: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737708083342_728-normal-WIFI.webp)
అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదర్శనగర్కు చెందిన లక్ష్మీ 52 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె భర్తకు ఏడాది క్రితం హార్ట్ ఆపరేషన్ అయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
News January 24, 2025
NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737648763566_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 24, 2025
NZB: గంజాయితో ఒకరి అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737647954290_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.