News March 18, 2025

జొన్నగిరి ఎస్ఐ జయశేఖర్ బదిలీ

image

తుగ్గలి మండలం జొన్నగిరి ఎస్ఐగా విధులు నిర్వర్తించిన జయశేఖర్ ను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్నూలు DSBలో ఉన్న మల్లికార్జునను జొన్నగిరి ఎస్ఐగా నియమించారు. జయశేఖర్ ను ఆదోని 3టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడడంలో జయశేఖర్ ఎంతో కృషి చేశారని మండల ప్రజలు తెలిపారు.

Similar News

News October 19, 2025

దీపావళి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ వేదిక రద్దు: కలెక్టర్

image

దీపావళి సందర్భంగా పబ్లిక్ గ్రీవెన్స్ వేదిక రద్దు చేసినట్లు కలెక్టర్ సిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 20 (సోమవారం)న జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం రద్దయిందని తెలిపారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News October 18, 2025

ఆడపిల్లలకు చదువుకునే హక్కు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి: కలెక్టర్

image

ఆడపిల్లలందరికీ చదువుకునే హక్కు తప్పకుండా ఇవ్వాలని, వారికి పౌష్టికాహారం అందించి, సమాజంలో లింగ వివక్ష లేకుండా చూడాలని ఇవాళ కలెక్టర్ సిరి అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో అన్నారు. జిల్లాలో కేవలం 56 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతంకి పెంచాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో రాణించాలని, విద్యకు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అందిస్తోందని, బాలికల రక్షణకు ‘స్త్రీ శక్తి’ యాప్ ఉందని పేర్కొన్నారు.

News October 18, 2025

జిల్లాలో ప్రధాని పర్యటన విజయవంతం: కలెక్టర్

image

జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ డా. సిరి అభినందించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. పర్యటనలో సీపీవో, ఆర్‌ అండ్‌ బీ, ఆర్టీసీ, డీఆర్వో, పారిశుద్ధ్య, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు సమర్థవంతగా వ్యవహరించారని తెలిపారు. పర్యటనలో ఒక అబ్బాయి మరణించడం దురదృష్టకరమని అన్నారు.