News July 24, 2024

జోగిపేట: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలి

image

చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. జోగిపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో న్యాయ అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా సహాయం అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 9, 2025

మెదక్: ’17న ఛలో ఢిల్లీ’

image

సీజేఐ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఈనెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటస్వామి మాదిగ పేర్కొన్నారు. మెదక్‌లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉన్నత స్థానంలో ఉన్న దళితులకే రక్షణ లేకుండా పోయిందని, సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

News November 8, 2025

మెదక్: ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

చర్చ్ అఫ్ సౌత్ ఇండియా మెదక్ కేథడ్రల్ పాస్టరేట్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 20 మంది సభ్యుల ఎన్నిక కోసం మొత్తం 60 మంది అభ్యర్థులు(జీఎస్‌పీ, పాస్‌నేట్, ఆల్ఫా ఒమేగా ప్యానెల్‌ల తరపున) పోటీపడ్డారు. 1712 మంది సభ్యులుండగా 1451 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.75% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు ఫలితాలు రానున్నాయి. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

News November 8, 2025

TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొండల్ రెడ్డి

image

తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా నూతన శాఖ ఏర్పడింది. TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బి .కొండల్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జడ్పిహెచ్ఎస్ ఝాన్సీ లింగాపూర్), కోశాధికారిగా శివ్వ నాగరాజు (శంకరంపేట(R)), ఉపాధ్యక్షుడిగా బాలరాజు (జడ్పీహెచ్ఎస్ కుర్తివాడ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు.