News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News January 22, 2026

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలపై వామపక్షాల గురి

image

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల రణం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల త్రిముఖ పోరులో కమ్యూనిస్టులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా, ఫలితాల తర్వాత ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమ మద్దతు లేకుండా మేయర్ పీఠం దక్కదని వామపక్షాలు ధీమాగా ఉన్నాయి. బలాబలాల లెక్కల్లో తమదే కీలక పాత్ర అని కమ్యూనిస్టు నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

News January 22, 2026

సహజీవనంలో మహిళకు భార్య హోదా ఇవ్వాలి: హైకోర్ట్

image

లివింగ్ రిలేషన్‌లో ఉండే మహిళలకు గాంధర్వ వివాహం/ప్రేమపెళ్లి కింద ‘భార్య’ హోదా కల్పించాలని మద్రాస్ హైకోర్ట్ అభిప్రాయపడింది. పెళ్లిపేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాచీన భారతదేశంలోని 8 వివాహాల్లో గాంధర్వ వివాహం ఒకటి. సహజీవనాన్ని ఈ వివాహంగా గుర్తించొచ్చు. ఈ విషయాల్లో BNSలోని Sec68 మహిళలకు రక్షణ కల్పిస్తుంది’ అని తెలిపారు.

News January 22, 2026

ఖమ్మంలో జేఈఈ మెయిన్స్‌ షురూ.. తొలిరోజు 98 శాతం హాజరు!

image

ఖమ్మం జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 1,748 మంది అభ్యర్థులకు గాను 1,721 మంది (98.4%) హాజరైనట్లు కో-ఆర్డినేటర్ పార్వతీరెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గంట ముందుగానే తనిఖీలు పూర్తి చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.