News February 3, 2025
జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Similar News
News January 22, 2026
ఆదిలాబాద్: రోడ్డుప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

బోథ్ మోడల్ స్కూల్ మలుపు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగు(17) మృతిచెందాడు. మండలంలోని నేరడిపల్లెకు చెందిన జంగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రికార్డుల పనిపై కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జంగు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పురుషోత్తం ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
News January 22, 2026
అభిషేక్ రికార్డు

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచారు. 2,898 బంతుల్లోనే ఈ మార్కు చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రసెల్(2,942), టిమ్ డేవిడ్(3,127), విల్ జాక్స్(3,196), గ్లెన్ మ్యాక్స్వెల్(3,239) ఉన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులే కాకుండా లీగ్స్, డొమెస్టిక్ మ్యాచులు ఇందులోకి వస్తాయి.
News January 22, 2026
నెల్లూరు: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పలు పోస్టుల్లో పని చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంటాఫీస్ కో-ఆర్డినేటర్ ఒక పోస్ట్, రికార్డు అసిస్టెంట్ నాలుగు పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు తమ దరఖాస్తులను ఈ నెల 27లోపు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.


