News February 3, 2025

జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం !

image

5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం క్రీ.శ 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. మొదట్లో అమ్మవారిని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజించేవారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 2004 ఫిబ్రవరి నెలలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేకమైన గుడి కట్టించి అందులో అమ్మ వారిని ప్రతిష్ఠించారు. 2005 నుంచి ఫిబ్రవరి నెలలో అమ్మవారి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Similar News

News February 11, 2025

పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్

image

బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.

News February 11, 2025

ఆధార్ అప్‌డేట్‌కు ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌ట్టండి: కలెక్టర్

image

ఐదేళ్లకు పైబ‌డిన పాఠ‌శాల విద్యార్థులు, 15 ఏళ్ల‌కు పైబ‌డిన విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ బ‌యోమెట్రిక్ అప్‌డేష‌న్ చేయించాల్సి ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌ట్టాల‌ని ఆయన తెలిపారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లాస్థాయి ఆధార్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జిల్లాలో ఆధార్ న‌మోదు స్థితిగ‌తులపై చర్చించారు.

News February 11, 2025

వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ ఆవిష్కరణ

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.

error: Content is protected !!