News February 14, 2025
జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని వినతి

జోగులాంబ ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని NSUI జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాదులోని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి సోమరాజుకు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల నుంచి జోగులాంబ ఆలయం, పాగుంట ఆలయాలకు అధికారిగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. ఆలయ EO అధికార దుర్వినియోగం చేస్తున్నాడని తెలిపారు.
Similar News
News October 16, 2025
రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: TPCC చీఫ్

ఈ నెల 18న BC సంఘాలు చేపట్టే తెలంగాణ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బంద్కు BRS, BJP, మావోయిస్టు పార్టీలు సపోర్ట్ తెలపగా తాజాగా అధికార పక్షమూ మద్దతు ప్రకటించింది. దీంతో ఎల్లుండి బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉంటుందని స్పష్టమవుతోంది. విద్యాసంస్థలకు యాజమాన్యాలు రేపు చెప్పే అవకాశముంది.
Share It
News October 16, 2025
ఇస్రో షార్లో 141 పోస్టులకు నోటిఫికేషన్

ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 141 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నీషియన్, సైంటిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచి NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ, BSc, MSc, BE, బీటెక్, ME, ఎంటెక్, BLSc, నర్సింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18- 35ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://www.isro.gov.in/
News October 16, 2025
ములుగు: దామోదరన్న లొంగిపోతారా?

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా కీలక నేతలుగా ఉన్న ఒక్కొక్కరు లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు@ దామోదర్ లొంగిపోతారా? పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్.. సభ్యుడు, దళ కమాండర్, కేకేడబ్ల్యూగా ఎదిగి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు.