News January 22, 2025

జోగులాంబ: కార్మికుల పోరాటం వల్లే ధరల పెరుగుదల: సీఐటీయూ

image

జోగులాంబ: కార్మిక సంఘాల పోరాటాల ఫలితానికి ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో కార్మికులు రిలే దీక్ష చేయడంతో ప్రభుత్వం ధరలను పెంచిందని ఆయన అన్నారు. ఆయన వెంట ఉప్పేరు నరసింహ ఉన్నారు.

Similar News

News November 8, 2025

మేడారం మహా జాతర పనులపై సందిగ్ధం..!

image

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సమీపిస్తోంది. జాతరకు మరో 81 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభివృద్ధి పనులపై సందిగ్ధం నెలకొంది. గ్రామంలో రోడ్డు వెడల్పు పనుల్లో స్థానికుల ద్వారా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య పెరుగుతోంది.

News November 8, 2025

వరంగల్: 24 అంతస్తులకు 24 ఏళ్లు కావాలా..?

image

WGLలో రూ.1200 కోట్లతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గత ప్రభుత్వం 2021లో శంకుస్థాపన చేసింది. 2 ఏళ్లలో పూర్తిచేసి 12అంతస్తుల్లో 35వైద్య విభాగాల్లో OP, IP సేవల కోసం 2208 పడకలను, 500 మంది వైద్యులు, 1000 మంది స్టాఫ్ నర్సులు, మరో 1000 మంది పారా మెడికల్ వైద్య సిబ్బంది సేవలు అందించేలా నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్లో పూర్తి చేయాలని నిర్ణయించినా ఇప్పట్లో పనులు పూర్తయ్యేలా లేవు.

News November 8, 2025

మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

image

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్‌పూర్‌లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.