News January 22, 2025
జోగులాంబ: కార్మికుల పోరాటం వల్లే ధరల పెరుగుదల: సీఐటీయూ

జోగులాంబ: కార్మిక సంఘాల పోరాటాల ఫలితానికి ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెంచారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో కార్మికులు రిలే దీక్ష చేయడంతో ప్రభుత్వం ధరలను పెంచిందని ఆయన అన్నారు. ఆయన వెంట ఉప్పేరు నరసింహ ఉన్నారు.
Similar News
News February 23, 2026
పచ్చిపాలతో మెరిసే చర్మం

* పచ్చి పాలు, తేనె కలిపి ఆ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కాటన్ బాల్స్తో శుభ్రం చేసుకోవాలి. కొద్ది సేపటికి చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * పచ్చి పాలలో అరటి పండును కలిపితే అది చర్మానికి మరింత మేలు చేస్తుంది. దీని కోసం కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
News February 23, 2026
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వానలు పడేందుకు ఆస్కారముందని తెలిపారు. హైదరాబాద్లో సాయంత్రం వేళ జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
News February 23, 2026
తిరుమల లడ్డూ అంశంపై రేపు అసెంబ్లీలో చర్చ

AP: అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై చర్చ జరగనుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై రేపు ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడనున్నారు. మ.12.30 గంటల నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగం ఉండనుంది. రేపు ఆయన కీలక ప్రకటన చేస్తారని సమాచారం. స్వల్ప అస్వస్థత కారణంగా Dy.CM పవన్ ఇవాళ సభకు రాలేదు. రేపటి చర్చలో ఆయన పాల్గొనే అవకాశముంది.


