News April 7, 2025
జోగులాంబ గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

@గద్వాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి సందర్భంగా 37 ఫిర్యాదులు వెల్లువ @అయిజ మండలం యాపదిన్నె గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పశు బల ప్రదర్శన బండ్ల గిరక పోటీలు @కేటిదొడ్డి మండలంలో సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత @ గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిది అందజేత @రేషన్ దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని బీజేపీ డిమాండ్.
Similar News
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.
News November 23, 2025
SRD: తీవ్ర విషాదం.. బిడ్డ మృతి తల్లి సూసైడ్

జహీరాబాద్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బిడ్డ మరణం జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. మండలంలోని ఎల్గోయికి చెందిన ఐషు(3) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపం చెందిన తల్లి లావణ్య(23) శనివారం సాయంత్రం అంత్యక్రియల అనంతరం ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో తల్లి, కుమార్తె మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 23, 2025
కోనసీమ కష్టాలకు పవన్ ‘బ్రేక్’ వేస్తారా?

కోనసీమ కొబ్బరి రైతులు కన్నీరు పెడుతున్నారు. మలికిపురం ప్రాంతంలో ఒకవైపు తెగుళ్లు, మరోవైపు ఆక్వా సాగుతో పెరిగిన ఉప్పునీటి ప్రభావం కారణంగా పచ్చని కొబ్బరి చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. తోటలు నాశనమవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 26న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించనున్నారు. పవన్ తమ సమస్యలు పరిష్కరిస్తారని రైతులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.


