News March 20, 2025
జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

జోగులాంబ :@ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్@ఉండవెల్లి : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి@ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ@ అలంపూర్ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం @మల్దకల్: తిమ్మప్ప స్వామికి బంగారు బహూకరణ @రాజోలి: ఇసుక తవ్వకాలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్@వడ్డేపల్లి: తిరుమలకు పాదయాత్ర@ ఇటిక్యాల మండలంలో ఇదీ పరిస్థితి..!@ జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
Similar News
News March 31, 2025
OU దూర విద్యలో ప్రవేశాలకు రేపు లాస్ట్ డేట్

ఓయూ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్ఆర్సీడీఈ)లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్-2 కింద UG, PG, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. అర్హులైన వారు మార్చి 31లోగా అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 31, 2025
నేహా కక్కర్ కన్సర్ట్.. నిర్వాహకులకు రూ.4.52 కోట్ల నష్టం

బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్ వల్ల తమకు రూ.4.52 కోట్ల ($5,29,000) నష్టం వచ్చినట్లు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆమె షో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్కు నేహా 3 గంటలు ఆలస్యంగా వెళ్లారు. దీంతో తనకు నిర్వాహకులు డబ్బులు చెల్లించలేదని ఆమె ఆరోపించారు.
News March 31, 2025
VKB: పోలీస్ స్టేషన్గా మారిన ఆర్డీవో ఆఫిస్

పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం పోలీస్ స్టేషన్గా కనిపిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంను పోలీస్ కార్యాలయంగా మార్చిన వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు. వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయాన్ని ఆదివారం సెలవు ఉండడంతో వెబ్ సిరీస్కు అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆర్డీవో కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా మార్చి షూటింగ్ నిర్వహిస్తున్నారు.