News February 15, 2025

జోగులాంబ: పంచాయతీ కార్యదర్శిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న ACB

image

ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ACB DSP బాలకృష్ణ కథనం మేరకు DPO శ్యామ్ సుందర్ సూచనతో ఒక వెంచర్ మేనేజర్ తో పంచాయతీ కార్యదర్శి రూ. 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు. DPO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News September 14, 2025

NLG: దసరాకు స్పెషల్ బస్సులు

image

దసరా పండుగను పురస్కరించుకుని నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 705 స్పెషల్ బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నారు. ఈ మేరకు రీజియన్ రూపొందించిన నివేదికను ఆర్టీసీ సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. దేవరకొండ డిపో పరిధిలో 131 బస్ సర్వీసులు, కోదాడలో 94, MLG 115, నల్గొండ 89, NKP 36, SRPT 144, యాదగిరిగుట్ట పరిధిలో 96 బస్ సర్వీసులు నడపనున్నారు.

News September 14, 2025

ములుగు జిల్లాలో 422మి.మీ భారీ వర్షపాతం నమోదు

image

ములుగు జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో 422మి.మీ వాన పడింది. సగటు వర్షపాతం 46.8మి.మీగా నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వెంకటాపురంలో 130.2, వాజేడులో 43.6, మంగపేటలో 24.2, వెంకటాపూర్ లో 34.2, ములుగులో 17.2, గోవిందరావుపేటలో 23.6, తాడ్వాయిలో 23.6, ఏటూరునాగారంలో 61.6, కన్నాయి గూడెంలో 63.8మి. మీ వర్షం కురిసింది.

News September 14, 2025

VJA: నీటి పరీక్షల రిపోట్ల ఆలస్యంపై అనుమానాలు.?

image

విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వ్యాప్తికి కారణాలపై ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. స్థానికంగా నిర్వహించిన కెమికల్ టెస్టుల్లో క్లోరిన్ శాతం సరిగ్గా ఉన్నా, మైక్రో బ్యాక్టీరియాలాజికల్ టెస్ట్ రిపోర్టులు నాలుగు రోజులుగా రాకపోవడం గమనార్హం. నీటి కాలుష్యం బయటపడితే ఉద్యోగాలు పోతాయనే భయంతో అధికారులు ఫలితాలను గోప్యంగా ఉంచుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.