News September 25, 2024
జోగుళాంబా దేవి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే ప్రముఖులు వీరే !

అక్టోబర్ 3-12వ తేది వరకు అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, అడిషనల్ డీజీపి మహేశ్ భగవత్, ఐజీ ఎం.రమేష్, ఎండోమెంట్ కమీషనర్ హనుమంతరావు, ఏపి జితేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఈఓ పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు.
Similar News
News November 20, 2025
కోయిలకొండ: ఎంపీడీవోల యూనియన్ అధ్యక్షుడిగా ధనుంజయ గౌడ్

మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ఎంపీడీవోల యూనియన్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా (కోయిలకొండ) ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా (నవాబ్ పేట) ఎంపీడీవో జయరాం నాయక్, జనరల్ సెక్రటరీగా (MBNR) కరుణశ్రీ, కోశాధికారిగా (హన్వాడ) ఎంపీడీవో యశోదమ్మ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా (జడ్చర్ల) ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా(భూత్పూర్) ఎంపీడీవో ఉమాదేవి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.
News November 20, 2025
MBNR: రేపు డయల్ యువర్ RM

ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News”తో తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 20, 2025
మహబూబ్ నగర్: ఎస్పీ కీలక ఆదేశాలు జారీ

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రోడ్లపై ధాన్యం మారపోసి ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా, ధాన్యంపై నల్లని కవర్లు కప్పడం వాటిపై రాళ్లని పెట్టడం వల్ల రాత్రి వేళల్లో వాహనదారులు ముందున్న అడ్డంకి గుర్తించలేక, భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.


