News July 24, 2024

జ్యూట్ బ్యాగ్స్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నందు బుధవారం కాంగ్రెస్ నేత చింతనిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో తయారుచేసిన జ్యూట్ బ్యాగులను జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలన్నారు. సామాజిక బాధ్యతతో జ్యూట్ బ్యాగులను వాడాలని పేర్కొన్నారు.

Similar News

News December 18, 2025

KMM: కల్లూరులో ఎక్కువ.. సింగరేణిలో తక్కువ

image

ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.72 శాతం పోలింగ్‌తో కల్లూరు ముందు వరుసలో ఉంది. వేంసూరు 90.63%, ఏన్కూరు 89.50%,పెనుబల్లి 88.98%,తల్లాడలో 88.14%,సత్తుపల్లిలో 87.36%, సింగరేణిలో 87.29% శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన 3వ విడతలో 2,43,983 లక్షల ఓటర్లుండగా, వారిలో 2,16,765 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

image

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.

News December 17, 2025

జైత్రం తండా సర్పంచ్‌గా జయంతి

image

సింగరేణి మండలంలోని జైత్రం తండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి మూడ్‌ జయంతి విజయకేతనం ఎగురవేశారు. బుధవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీతో ఘనవిజయం సాధించి సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. జయంతి విజయం సాధించడంతో తండాలో గులాబీ శ్రేణులు బాణసంచా కాల్చి, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.