News January 2, 2025

జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించాలి: శాప్ ఛైర్మన్

image

విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఆమె పట్టుదల అంకితభావాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆమెను ఆయన అభినందించారు.

Similar News

News January 21, 2025

ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృతి?

image

ఛ‌త్తీస్‌ఘ‌డ్-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మంగళవారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు చ‌ల‌ప‌తి, ఒడిశా మావోయిస్టు పార్టీ ఇన్‌‌ఛార్జ్ మొండెం బాల‌కృష్ణ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతుండగా,మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముందని పోలీసు వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి.

News January 21, 2025

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

image

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

స్టీల్ ప్లాంట్: విద్యుత్ షాక్‌తో కార్మికుడి దుర్మరణం

image

స్టీల్ ప్లాంట్‌ రైల్వే లైన్‌లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు సోమవారం మృతి చెందాడు. ఇస్లాం పేటకు చెందిన మహమ్మద్ గౌస్ (26) స్టీల్ ప్లాంట్‌లో రైల్వేకు చెందిన సురభి ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తాకడం వల్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.