News April 11, 2024
టాటా-ఎర్నాకులం ట్రైన్ రీ షెడ్యూల్

సంబల్పూర్ డివిజన్లో సబ్ వే పనులు జరుగుతున్న కారణంగా ఈనెల 13న టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ట్రైన్, నాలుగు గంటల ఆలస్యంగా బయలుదేరుతుందని వాల్తేర్ రైల్వే డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈనెల 13 ఉదయం 5.15 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ నాలుగు గంటల ఆలస్యంగా 9.15 గంటలకు బయలుదేరుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
Similar News
News October 26, 2025
విశాఖలో పాఠశాలలు, కళాశాలలకు 2 రోజుల సెలవు

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు 2 రోజులపాటు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. 27, 28వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అన్ని పాఠశాలు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News October 26, 2025
విశాఖ కలెక్టరేట్లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 26, 2025
విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


