News February 15, 2025

టాప్‌లో ఎన్టీఆర్ జిల్లా

image

స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యకలాపాల అమలులో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచింది. ఈ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చామని సీఎం చంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఈ జాబితాలో టాప్‌లో ఉండగా, అల్లూరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News December 26, 2025

త్రీమెన్ కమిటీలో రైతులుండాల్సిందే: రైతు JAC

image

AP: మంత్రులు పెమ్మసాని, నారాయణ, MLA శ్రవణ్‌లతో కూడిన కమిటీ ఏ ఒక్క అంశాన్నీ పరిష్కరించలేదని అమరావతి రైతు JAC నేతలు విమర్శించారు. కమిటీ ఏ సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో కాకుండా వేరే చోట ప్లాట్లు ఇవ్వాలని, గ్రామాల పరిధిలోనే శ్మశానాలుండాలని కోరారు. R5 జోన్ సమస్య మార్చిలోగా పరిష్కరించాలన్నారు. కమిటీలో రైతులనూ చేర్చాలని విన్నవించారు. నిన్న జరిగిన JAC భేటీలో పలు తీర్మానాలు చేశారు.

News December 26, 2025

బాపట్ల జిల్లాలో నిధుల వినియోగంపై పాలకులకు ఆంక్షలు..!

image

బాపట్ల జిల్లాలో సర్పంచ్, MPTC, ZPTC పదవీకాలం మరో 3 నెలల్లో ముగియనుంది. పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పదవీకాలం పూర్తయ్యేలోపు నిధులను ఖాళీ చేసేందుకు కొందరు ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బిల్లులూ చెల్లించవద్దని అధికారులు ఆదేశించారు.

News December 26, 2025

BPS సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్

image

అర్హులైన భవన యజమానులు భవన క్రమబద్ధీకరణ పథకం-2025 (BPS–2025)ను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 1985 జనవరి 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు నిర్మించిన అనధికార భవనాలు, అనుమతులకు విరుద్ధంగా చేసిన విస్తరణలు క్రమబద్ధీకరణకు అర్హమన్నారు. దరఖాస్తులు 11 మార్చి 2026లోపు www.bps.ap.gov.in ద్వారా మాత్రమే లైసెన్‌డ్ టెక్నికల్ పర్సనల్ (LTP) సహాయంతో సమర్పించాలన్నారు.