News April 4, 2024
టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీగా ప్రొఫెసర్ నరేష్ రెడ్డి

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSSET) మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రం అందజేశారు. 2023లో టీఎస్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. అయితే 2024లో మళ్లీ టీఎస్ సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెంబర్ సెక్రటరీని నియమించారు.
Similar News
News November 25, 2025
GHMCలోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఇవే!

☛మున్సిపాల్టీలు: పెద్దఅంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, IDAబొల్లారం,తెల్లాపూర్, అమీన్పూర్
☛కార్పొరేషన్లు: బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్,నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్నగర్, బడంగ్పేట్ విలీనమవుతాయి.
ఇబ్రహీంపట్నం, కొత్తూర్, అలియాబాద్ లిస్ట్లో లేవు
News November 25, 2025
రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.
News November 25, 2025
రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.


