News February 21, 2025

టీచర్‌గా మారిన కలెక్టర్.. తాను చెబుతూ పిల్లలతో చెప్పిస్తూ..

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టీచర్‌గా మారారు. విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బోధించారు. విద్యార్థులతో పాఠాలు బోధించేలా చేశారు. వారితో మమేకమై పోయారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహ భోజనం చేశారు. ఈ పరిణామం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎల్లారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఈ సంఘటన గురువారం జరిగింది.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ RECORD

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

News November 14, 2025

VKB: పోలీసు శాఖలో టెన్షన్.!

image

వికారాబాద్‌ జిల్లా పోలీసు యంత్రాంగంలో బదిలీల టెన్షన్ పట్టుకుంది. తాండూరు సబ్ డివిజన్‌కు సంబంధించిన పోలీసులపై చర్యలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ అధికారులను బదిలీ చేస్తారా.. వేటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారిందని చర్చించుకుంటున్నారు. ఇద్దరు సీఐలు, పెద్దేముల్ ఎస్ఐ, బషీరాబాద్‌ ఎస్ఐల బదిలీ తప్పదని ప్రచారం జరగుతోంది. తాండూర్ డీఎస్పీగా నేడు నర్సింగ్ యాదయ్య బాధ్యతలు తీసుకుంటున్నట్లు సమాచారం.

News November 14, 2025

మాజీ AVSO సతీశ్‌ మరణంపై YCP ట్వీట్

image

మాజీ <<18284097>>AVSO సతీశ్‌<<>>ది ఆత్మహత్యే అని ఆయన సన్నిహితులు చెప్పారంటూ YCP ట్వీట్ చేసింది. ‘సతీశ్ మరణానికి ముందు గోడును సన్నిహితుల వద్ద వెళ్లబోసుకున్నాడట. పరకామణి కేసులో సిట్‌ బృందం అప్పటి CIలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సతీశ్ కుమార్, SI లక్ష్మిరెడ్డిని వేధించి విచారణలో తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి చేశారట. వీటిని తట్టుకోలేకే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అన్నారు’ అంటూ రాసుకొచ్చింది.