News February 21, 2025
టీటీడీకి మినీ ట్రక్కు విరాళం

తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన సాథీ మినీ ట్రక్కును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ మోహన్ రాజుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 11, 2025
HYD: AI డేటా సైన్స్ సాప్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కోర్సుల్లో శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మణికొండలోని అకాడమి డైరెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. వందకుపైగా కంప్యూటర్ సాప్ట్వేర్ కోర్సుల్లో శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం అన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News July 11, 2025
GNT: నేడు విచారణకు హాజరు కానున్న అంబటి

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శుక్రవారం విచారణ నిమిత్తం సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు హాజరు కానున్నారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ కోసం నేడు అంబటి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు.
News July 11, 2025
మనుబోలు: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

మనుబోలు మండలం పల్లిపాలెం వద్ద శుక్రవారం ఉదయాన్నే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. TPగూడూరు(M) గంగపట్నంకు చెందిన లక్ష్మయ్య (22) కట్టువపల్లిలో రొయ్యల గుంట వద్ద పని చేస్తున్నాడు. ఉదయాన్నే బైకుపై పల్లిపాలెం వెళ్తూ దారిమధ్యలో గేదె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు విచారణ చేపట్టారు.