News April 12, 2025
టీటీడీ కోటి విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.1 కోటిని వైజాగ్కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు.
Similar News
News November 3, 2025
వరంగల్: వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తే చర్యలు!

కారులో ప్రయాణించే వారిని గుర్తించేందుకు వీలు లేకుండా కార్ గ్లాస్లకు బ్లాక్ ఫిల్మ్ అతికించడం నేరమని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫిల్మ్ను తొలగించడంతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు గాను రూ.500 నుంచి రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.
News November 3, 2025
ADB: మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజార్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరు దుకాణాల కేటాయింపులు ఈ కార్యక్రమంలో పూర్తయ్యాయి. ఎక్సైజ్ పాలసీ–2025–27 ప్రకారం షాపులకు టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. ప్రక్రియ మొత్తం ఫోటో, వీడియో రికార్డింగ్తో పూర్తి పారదర్శకంగా సాగింది.
News November 3, 2025
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం కానీ, వినియోగించడం కానీ జరగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి సాగు పై వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


