News April 12, 2025
టీటీడీ కోటి విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.1 కోటిని వైజాగ్కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు.
Similar News
News January 18, 2026
కాకినాడలో రేపు జాబ్ మేళా

కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయం వద్ద ఈ నెల 19న సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ PD లచ్చారావు తెలిపారు. పదో తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ ధ్రువీకరణ పత్రాలతో సోమవారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 18, 2026
మళ్లీ పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఇటీవల రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న అరకులోయలో 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, తూ.గో., ప.గో., అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి తక్కువ విజిబిలిటీ నమోదైంది. అన్ని జిల్లాల్లో మంచు దుప్పటి కప్పేసింది. ఇవాళ కూడా దట్టమైన పొగమంచు ఉంటుందని, ఉ.8 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News January 18, 2026
అనంత జిల్లా అల్లుడికి 116 రకాల పిండి వంటలు

అనంతపురం జిల్లాకు చెందిన గౌతమ్ గతేడాది గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంక్రాంతి పండుగకు అత్త గారింటికి వెళ్లారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారు గోదారోళ్ల మర్యాదలు చూపించారు. 116 రకాల పిండి వంటలతో భోజనం వడ్డించారు. కొత్త అల్లుళ్లకు రకరకాల పిండి వంటలతో మర్యాదలు చేయడం ఈ మధ్య గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.


