News October 31, 2024

టీటీడీ బోర్డు సభ్యుడిగా సిక్కోలు వాసి

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్టింగ్‌తో ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణ చీఫ్ డిజైనర్‌గానూ పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఆ పార్టీ కోటాలో బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు.

Similar News

News November 7, 2025

దర్శకుడిగా మన సిక్కోలు వాసి..!

image

మన శ్రీకాకుళం కుర్రాడు రాహుల్ దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం కానున్నాడు. సినిమాలపై మక్కువ, దర్శకుడు కావాలనే ఆసక్తితో చదువుతూనే మూవీ మేకింగ్ అంశాలను తెలుసుకున్నాడు. తొలుత వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం, సహాయ దర్శకుడిగా పదేళ్లు పని చేశాడు.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’(కామెడీ జోనర్) మూవీకి డైరెక్షన్ వహించగా, ఆ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది.

News November 7, 2025

శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

image

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.

News November 7, 2025

శ్రీకాకుళం: జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్

image

జిల్లా వ్యవసాయ అధికారిగా మనోహర్ ప్రసాద్ గురువారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. వ్యవసాయ శాఖ సేవలు రైతులకు అందించడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు రైతులకు చేర్చడం, లాభసాటి వ్యవసాయ పద్ధతులు అమలు లక్ష్యంగా వివరించారు.