News October 7, 2024

టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్

image

కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

ప్రొద్దుటూరు: బంగారం వ్యాపారి కేసులో కొత్త ట్విస్ట్.!

image

ప్రొద్దుటూరు బంగారం వ్యాపారి <<18366988>>శ్రీనివాసులు కేసులో<<>> కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరదలు పద్మజ బావ శ్రీనివాసులుపై 1 టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ తిమ్మారెడ్డి వివరాల ప్రకారం.. శ్రీనివాసులు, వెంకటస్వామి కలిసి వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం కోసం ఉమ్మడిగా అప్పులు చేశారు. ఆదాయం అన్న తీసుకొని, అప్పులు తమ్మునిపై రుద్దాడు. ఈ మేరకు వెంకటస్వామి భార్య తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసిందన్నారు.

News November 23, 2025

కడప: గ్రామ స్థాయికి వెళ్లని స్వచ్ఛాంధ్ర ప్రచారం?

image

ప్రతి నెలా 3వ శనివారం అధికారులు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ ప్రచారం చేసినా, గ్రామస్థాయిలో అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఆదివారం కమలాపురం మండలం <<18369261>>ఎర్రగుడిపాడులోని<<>> ఓ కాలనీ ప్రజలు విరేచనాలు, వాంతులతో మంచాన పడ్డారు. దీనికి కారణం అక్కడి వారికి పారిశుద్ధ్యంపైన అవగాహన లేకపోవడమేనని పలువురు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అధికారులు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లట్లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.

News November 23, 2025

సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన కడప జట్టు

image

69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్ అండర్-14 పోటీల్లో కడప జిల్లా బాలురు, బాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలురు గోదావరి జట్టును, బాలికలు కృష్ణా జట్టును ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాయి. అలాగే ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, విజయనగరం బాలికల జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. రేపు ఉదయం సెమీఫైనల్స్ జరగనున్నాయి.