News March 29, 2024
టీడీపీలో చేరిన మల్లెల రాజేశ్ నాయుడు

కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.
Similar News
News March 6, 2026
GNT: ‘రైతుల యోగక్షేమాలు చూడనప్పుడు భూసేకరణ ఎందుకు ?’

ల్యాండ్ పూలింగ్ 2వ దశకు వ్యతిరేకంగా శుక్రవారం బ్రాడీపేట UTF కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అన్నీ కోణాల్లో ఆలోచన చేయలన్నారు. 34 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతుల యోగక్షేమాల బాధ్యత చంద్రబాబుపై ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయలేదని, అటువంటప్పుడు 2వ విడత సేకరణ ఎందుకని ప్రశ్నించారు.
News March 6, 2026
శాసనమండలిలో వైయస్ఆర్సీపీ మరో వాయిదా తీర్మానం

ఏపీ శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చారు. విశాఖలో గీతం యూనివర్సిటీకి సంబంధించిన రూ.5 వేల కోట్ల విలువైన భూదోపిడీ అంశంపై మండలిలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్చకు అనుమతించలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంపై చర్చించే ధైర్యం ఉందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
News March 6, 2026
తెనాలిలో ఉగాది పురస్కారాల సంబరాలు..!

పరాభవనామ తెలుగు సంవత్సరo ఉగాది పురస్కారాల సంబరాలను మా-ఎపి భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి అవార్డులను ప్రధానోత్సవం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆహ్వానించబోతున్నట్లు వివరించారు. తేదీ,వేదిక త్వరలో ప్రకటిస్తామన్నారు.


